తెలుగు ప్రేక్షకులనే కాకుండా హిందీ ఆడియన్స్ను అలరిస్తున్న బన్నీ
By: chandrasekar Thu, 16 July 2020 6:48 PM
ఇప్పటి వరకు ఏ హీరో
సాధించని ఫీట్ను బన్నీ అందుకున్నారు. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డ్
చేరింది. తన సినిమాతో తెలుగు ప్రేక్షకులనే
కాకుండా హిందీ ఆడియన్స్ను బన్నీ అలరిస్తున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు
అర్జున్ సూపర్ హిట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరైనోడు’ యూట్యూబ్లో దుమ్ముదులుపుతోంది.
రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతోంది. ‘సరైనోడు’ హిందీ అనువాద చిత్రం బుధవారం 300
మిలియన్ వ్యూస్ మార్క్ను అందుకుంది. అంటే, ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా ఈ సినిమాను యూట్యూబ్లో వీక్షించారు.
యూట్యూబ్లో 300
మిలియన్ వ్యూస్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘సరైనోడు’ హిందీ వెర్షన్ నిలిచింది.
అంతేకాదు, ఈ
సినిమాకు 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. బోయపాటి శ్రీను
దర్శకత్వంలో 2016లో వచ్చిన ‘సరైనోడు’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో
అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కొత్త అల్లు అర్జున్ను బోయపాటి ఆవిష్కరించారు.
అల్లు అర్జున్ హీరోయిజం, ఆది పినిశెట్టి స్టైలిష్ విలనిజం సినిమాకు ప్రధాన
బలాలు.
ఈ సూపర్ హిట్ సినిమా
హిందీ అనువాద హక్కులను బాలీవుడ్కు చెందిన గోల్డ్మైన్స్ టెలీఫిలింస్ సంస్థ
కొనుగోలు చేసింది. హిందీలోకి అనువాదం చేసి ‘సరైనోడు’ టైటిల్తోనే యూట్యూబ్లో
విడుదల చేసింది. 2018 డిసెంబర్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఈ చిత్రం
రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది.
గతేడాది ఆగస్టులో ఈ
సినిమా 200
మిలియన్ మార్కును అందుకోగా.. ఇంచుమించుగా ఏడాది కాలంలో మరో 100
మిలియన్ వ్యూస్ సాధించింది. సౌత్ స్టార్స్కు హిందీ సినిమా ప్రేక్షకుల్లో ఆదరణ
పెరుగుతుండటంతో ఇక్కడి సినిమాలను అనువాదం చేసి యూట్యూబ్లో విడుదల చేస్తున్నారు.
అల్లు అర్జున్ తరవాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాలను హిందీ ప్రేక్షకులు ఎక్కువగా
చూస్తున్నారు. ‘నేను శైలజ’, ‘హలో గురు ప్రేమ కోసమే’ హిందీ అనువాద చిత్రాలు 200
మిలియన్ వ్యూస్ సాధించాయి.
నితిన్-సమంత జంటగా
నటించిన ‘అ ఆ’ సినిమా కూడా 200 మిలియన్ వ్యూస్ మార్క్ను అందుకుంది. ఇటీవల
బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ సినిమా కూడా 200 మిలియన్ వ్యూస్ దాటింది. ఇదిలా ఉంటే, అల్లు
అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా 250 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ సినిమా కూడా త్వరలో 300
మిలియన్ మార్క్ను అందుకునే అవకాశం ఉంది.