Advertisement

  • Breaking News: క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో...!

Breaking News: క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో...!

By: Anji Thu, 22 Oct 2020 04:55 AM

Breaking news: క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో...!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. తన కవల కుమారుల 10వ పుట్టినరోజు నాడు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు బాబా. ఆగస్టులో తన అనారోగ్యం గురించి సంజయ్ దత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడిన సంజయ్ దత్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది.

దీంతో సంజయ్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు బాబా క్యాన్సర్ నుంచి కోలుకుని అందరికీ శుభవార్త చెప్పారు. తాను క్యాన్సర్‌ నుంచి కోలుకున్నట్టు సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

‘‘గ‌డిచిన‌‌ కొన్నివారాలు నాకు, నా కుటుంబానికి అత్యంత క్లిష్టమైన సమయం. కానీ, వారు చెప్పినట్టు దృఢంగా పోరాడేవాళ్లకే దేవుడు కఠినమైన పరీక్షలు పెడతాడు. ఈ రోజు నా పిల్లల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఒక సంతోషకరమైన విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాను. నా ఆరోగ్యమే వారికి నేనిచ్చే పెద్ద బ‌హుమ‌తి.

మీ అంద‌రి ప్రేమాభిమానాలు లేక‌పోతే ఈ గెలుపు సాధ్యమ‌య్యేదే కాదు. ఈ కష్టకాలంలో నా వెంటే ఉండి నాలో ఎంతో ధైర్యాన్ని నింపిన నా కుటుంబానికి, స్నేహితులకు, నా అభిమానులకు నేను రుణపడి ఉంటాను.

నా పట్ల మీరు చూపించిన ప్రేమానురాగాలకు, వెలకట్టలేని దీవెనలకు ధన్యవాదాలు. ముఖ్యంగా కోకిలా బెన్ హాస్పిటల్‌లో నా పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తూ చికిత్స అందించిన డాక్టర్ సేవంతి, ఆమె డాక్టర్ల బృందానికి, నర్సులకు, వైద్య సిబ్బందికి రుణపడి ఉంటాను’’ అని సంజయ్ దత్ పేర్కొన్నారు.

క్యాన్సర్ నుంచి కోలుకున్న సంజయ్ దత్ ఇటీవల ముంబైలో సెలూన్‌కు వెళ్లి హెయిర్ స్టైలింగ్ చేయించుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ‘షంషేరా’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వచ్చే నెల నుంచి ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. సంజయ్ దత్ పార్ట్ చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

Tags :
|
|

Advertisement