పర్యావరణం పై కొత్త పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్...!
By: Anji Fri, 25 Dec 2020 3:50 PM
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్లోని అరణ్య భవన్లో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్పై రూపొందించిన పాటను వనజీవి రామయ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ పాటను దేశపతి శ్రీనివాస్ రచించగా... గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
ఈ పాటను దేశపతి శ్రీనివాస్ రచించగా.. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. లోక్ సభ సభ్యుడు సంతోష్ కుమార్ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి కొనియాడారు.
హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 4 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు.
Tags :