ఎస్పీ బాలుకు`బిగ్బాస్-4`ఘణ నివాళి..!
By: Anji Sat, 26 Sept 2020 5:50 PM
సంగీత కళామ తల్లి ముద్దు బిడ్డ గాన గంధర్వుడు ఎస్పీబీ ఇప్పుడు గంధర్వ లోకానికి వెళ్లారు. కరోనాను జయించి మీముందుకు వస్తానంటూ చెప్పి అందరిలో భరోసాను నింపిన ఎస్పీబీ.. ఎవరికీ చెప్పకుండానే దివికేగారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హఠాన్మరణం కొన్ని కోట్ల మందిని కలిచి వేసింది.
ఎంతో మందిని విషాదంలో ముంచెత్తింది. ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కన్నీటితో బాలుకు నివాళులర్పించారు. అయితే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా బహుముఖ ప్రఙ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఎస్పీబీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ప్రస్తుతం ప్రసారమవుతున్న `బిగ్బాస్-4` కార్యక్రమం ద్వారా బాలుకు నాగార్జున ఘనంగా నివాళులర్పించారు. `ఆ స్వరం ఇక పలకదని, ఆ వరం మనకిక లేదని, సరిగమలు కన్నీళ్లు పెట్టాయి. రాగాలన్నీ బాధపడ్డాయి. కానీ, ఆయన గానాన్ని మనం ఎప్పటికీ ఆస్వాదిస్తూనే ఉంటాం. దాచుకో స్వామి దాచుకో.. మా బాలుని జాగ్రత్తగా దాచుకో` అంటూ నాగార్జున పేర్కొన్నారు. ఆ వీడియోను నాగార్జున ట్విటర్ ద్వారా షేర్ చేశారు.