లేడీ విలన్ గా మారనున్న అందమైన హీరోయిన్
By: chandrasekar Sat, 26 Sept 2020 11:13 AM
సినీ పరిశ్రమలో ప్రస్తుతం
బ్యూటీఫుల్ హీరోయిన్స్ విలన్ పాత్రలు పోషించడం సాధారణమైంది. ఇటీవల చాలా
సినిమాల్లో వరలక్ష్మి శరత్కుమార్ ఇలాంటి
పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు నటి పూర్ణ కూడా విలన్గా
మారబోతోంది. పూర్ణ అకా షామ్నా ఖాసిం తెలుగులో 'సీమ టపాకాయ్',
‘అవును’, ‘అవును2’,
'అవంతిక' వంటి చిత్రాల్లో నటించిన పూర్ణను తాజాగా డైరెక్టర్
విజయ్ కుమార్ కొండా తన తరువాతి చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి సంప్రదించినట్టు
టాక్. ఈ ప్రాజెక్టుకి పూర్ణ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ కుమార్
కొండా డైరెక్షన్లో యువ హీరో రాజ్ తరుణ్ నటించిన రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రం
‘ఒరే బుజ్జిగా’ అక్టోబర్ 2 న
ఒటిటి ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. అదే రోజున విడుదలయ్యే అనుష్క శెట్టి 'నిశ్శబ్దం' సినిమాతో రాజ్ తరుణ్ పోటీ పడబోతున్నాడు.‘ఓరే బుజ్జిగా’ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా
డైరెక్షన్లో రాజ్ తరుణ్ మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూజా వేడుకతో
ప్రారంభించిన ఈ చిత్రం కోసం ప్రముఖ
నిర్మాత కె.ఎస్.రామారావు ముహూర్తం షాట్కు క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. పూర్ణను
లేడీ విలన్గా తీసుకుంటుంది కూడా ఈ సినిమా కోసమే. మొత్తానికి డైరెక్టర్ విక్రమ్
కుమార్ కొండా బ్యూటీఫుల్ హీరోయిన్ని మరో లేడీ విలన్గా ఇండస్ట్రీకి పరిచయం
చేస్తున్నాడన్న మాట.