మహేష్ మూవీకి వీసా సమస్యల వల్ల అడ్డంకులు
By: chandrasekar Wed, 21 Oct 2020 3:39 PM
సర్కారు వారి పాట
సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ
సినిమాని పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కథానాయికగా
కీర్తిసురేష్ నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే చాలా కారణాల వల్ల ఈ సివిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుందో స్పష్టత
రావడం లేదు. అయితే కొన్ని వార్తల ప్రకారం
ఈ మూవీ షూటింగ్ అమెరికాలో జరగాల్సి ఉండగా కొన్ని వీసా సమస్యల వల్ల అడ్డంకులు
ఏర్పడ్డాయి.
ఆమెరికాలో సర్కారు వారి
పాట సినిమా సుమారు నెల పాటు షూటింట్ చేయాల్సి ఉందట. అయితే వీసా పర్మిషన్స్ లో
జాప్యం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయట. వీసా ప్రక్రియ ముగిస్తే త్వరగా అమెరికా
వెళ్లడానికి టీమ్ సిద్ధంగా ఉంది అని టాక్. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర
నిర్మిస్తున్నాడు. థమన్ సర్కారు వారి పాట సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.