Advertisement

జగన్ నా వీరాభిమాని ..బాలకృష్ణ

By: Sankar Sun, 07 June 2020 8:09 PM

జగన్ నా వీరాభిమాని ..బాలకృష్ణ

నటసింహా నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అని, అప్పట్లో బాలయ్య అభిమాన సంఘానికి ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేశారని కిందటేడాది జూన్‌లో ఒక పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం పేరిట ‘సమరసింహారెడ్డి’ పోస్టర్‌తో నూతన సంవత్సర శుభాకాంక్షలు (2000) తెలుపుతూ పేపర్‌లో వచ్చిన ప్రకటనను బాలయ్య అభిమానులు బాగా వైరల్ చేశారు. అయితే, ఇది ఫేక్ అని అప్పట్లో చాలా మంది ఖండించారు.

కానీ, ఇది నిజమేనని స్వయంగా నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన వీరాభిమాని అని, కడప అభిమాన సంఘం టౌన్ ప్రెసిడెంట్ అని చెప్పారు. అయితే, రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు అని బాలయ్య అన్నారు. దీనికి తన తండ్రిని ఉదాహరణగా చెప్పారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పట్లో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌లో 90 శాతం మంది ఆయన అభిమానులేనని గుర్తుచేశారు. కాగా, జగన్ తన వీరాభిమాని అని స్వయంగా బాలకృష్ణ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు ఈ మాటలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరి బాలయ్య వ్యాఖ్యలకు జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు, జూన్ 10న బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఎవరి ఇళ్లలో వారే ఉంటూ కేక్ కట్‌చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని చూస్తున్నారు.


Tags :
|
|
|
|

Advertisement