అనుష్క శెట్టి సినిమాలకు స్వస్తి పలికే ఆలోచనలో వున్నారని సమాచారం
By: chandrasekar Mon, 13 July 2020 10:25 AM
అనుష్క శెట్టికి తెలుగు
సినిమా కథానాయికల్లో వున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
హీరోలతో సమానంగా క్రేజ్ను
సంపాందించుకున్న అనుష్క ఇమేజ్ ‘బాహుబలి’తో మరింత పెరిగింది. ఆమె డేట్స్ కోసం
స్టార్ హీరోలు ఎదురుచూస్తుంటారు.
అయితే ‘బాహుబలి-2’ తర్వాత
ఈ అందాలభామ సినిమాల ఎంపిక విషయంలో మరింత పర్టిక్యులర్గా వుంటుంది.
బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్ధం
చిత్రాల్లో మాత్రమే నటించింది. ‘సైరా’లో చిరంజీవిపై వున్న అభిమానంతో అతిథి పాత్రలో
మెరిసింది.
అయితే త్వరలోనే ఈ
బెంగళూరు సోయగం సినిమాలకు గుడ్బై చెప్పనుందని సమాచారం. అందుకే కొత్త చిత్రాలేమీ
అంగీకరించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇంతకుముందే అంగీకరించిన
గౌతమ్మీనన్ చిత్రం కూడా క్యాన్సల్ అవ్వడంతో అనుష్క శెట్టి సినిమాలకు స్వస్తి
పలికే ఆలోచనలో వున్నారని తెలిసింది.