Advertisement

అనుష్క భావోద్వేగపూరిత సందేశం

By: Sankar Wed, 17 June 2020 10:57 AM

అనుష్క భావోద్వేగపూరిత సందేశం



బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ అకాల మరణంతో ఒక్కసారిగా సెలెబ్రిటీలు అంత షాక్ కు గురి అయ్యారు ..టాలీవుడ్ జేజెమ్మ అనుష్క కూడా సుశాంత్ మరణంపై రియాక్ట్ అయింది ..ఈ మేరకు భావోద్వేగ పూరిత సందేశం పోస్ట్ చేస్తూ ఈ ప్రపంచంలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదని పేర్కొంది. ప్రతీ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతూనే ఉంటాయని, కొందరు బయటపడి వాటిని చెప్పుకుంటే.. ఇంకొందరు లోలోపల కుమిలిపోతారని తెలిపింది. అయితే అందరి టార్గెట్ ఆ సమస్యకు పరిష్కారం తప్ప ఇంకోటి ఉండదని, అంతా కలిసి ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నించాలని ఆమె పేర్కొంది.

ఈ ప్రపంచంలో సరైన మార్గం, ఇది సరికాని మార్గం అంటూ ఏదీ ఉండదని పేర్కొన్న అనుష్క.. మనకు సరైంది అనిపించిన మార్గంలో ముందుకు సాగాలని చెప్పింది. మనం ప్రతి సమస్యకు పరిష్కారం చూపలేకపోవచ్చు కానీ.. ఓ చిన్న చొరవ ఎంతో మార్పును తెస్తుందని, మార్పనేది నెమ్మదిగానే మొదలవుతుందని పేర్కొంటూ ఎమోషనల్ సందేశమిచ్చింది అనుష్క. మీ నవ్వు, మాటల్ని వినే గుణం, ఆప్యాయతతో కూడిన స్పర్శ ఎదుటివ్యక్తి జీవితంలో ఎంతో మార్పు తెస్తుందని తెలిపింది.

భాగమతి సినిమా తర్వాత కొంతకాలం బ్రేక్ ఇచ్చిన అనుష్క.. 'నిశ్శబ్దం' మూవీతో తెలుగుతో పాటు పలు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రంలో మాధవన్, షాలినీ పాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ విడుదల కానుంది.



Tags :
|
|

Advertisement