గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అనుపమ పరమేశ్వరన్
By: Sankar Thu, 10 Dec 2020 8:45 PM
ఇటీవల సినీ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ అనేకమందికి మొక్కల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ..మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకుని ఇటీవల వచ్చిన కొత్త నటుల వరకు అందరు మొక్కలు నాటుతున్నారు...
ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు బాచుపల్లిలో సౌత్ ఇండియన్ సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మొక్కలు నాటింది.
అనంతరం అనుపమ మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని హీరో నిఖిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటనని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది. అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో ముగ్గురుకి సోషల్ వేదిక ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చేస్తానని తెలిపింది