- హోమ్›
- వినోదం›
- వెంకటేష్ , వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్ F2 సినిమాకు కేంద్రం నుంచి ప్రతిష్టాత్మక అవార్డు
వెంకటేష్ , వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్ F2 సినిమాకు కేంద్రం నుంచి ప్రతిష్టాత్మక అవార్డు
By: Sankar Wed, 21 Oct 2020 3:13 PM
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలు గా నటించిన ఎఫ్ 2 తెలుగులో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమాలో వారిద్దరి కామెడీ టైమింగ్ ప్రజలను ఆకట్టుకుంది. సినిమా చుస్తున్నంతసేపు థియేటర్లో జనాలు కడుపుబ్బా నవ్వుకున్నారు ..భార్య మీద ఫ్రస్ట్రేషన్ ఉన్న భర్తగా విసితిరి వెంకటేష్ అదరగొట్టాడు వరుణ్ తేజ్ కూడా వెంకీ తో సమానంగా పోటీ పది నటించాడు..
కాగా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్ లు గా నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు అద్భుతమైన గౌరవం దక్కింది. 2019 ఇండియన్ పనోరమ విభాగంలో ఎఫ్-2 సినిమాకు అవార్డు దక్కింది.
అయితే 2019 ఇండియన్ పనోరమలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఎఫ్-2 కావడం విశేషం. అయితే ఎఫ్ 2 సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 తీయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సినిమా కి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.