Advertisement

  • నాగ చైతన్య సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది

నాగ చైతన్య సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది

By: chandrasekar Wed, 26 Aug 2020 12:00 PM

నాగ చైతన్య సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది


ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు లవ్ స్టోరీ షూటింగ్ జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు.

'లవ్ స్టోరీ' తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా ఆయన 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నాడు. మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ ఇటీవల నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ 'హలో' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. అయితే ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చే ఈ తాజా చిత్రానికి 'థ్యాంక్యూ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. విక్రమ్ కుమార్ ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాల కంటే ఈ సినిమా చాలా విభిన్నం గా తెరకెక్కించాలని చూస్తున్నాడట.

నిజానికి 'మనం' సినిమా తర్వాత ఇంతవరకు సరైన హిట్ అందుకోలేదు విక్రమ్. దీంతో నాగ చైతన్యతో ఓ హారర్ సినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన చైతన్య ఫస్ట్ టైం హారర్ సినిమా చేయనున్నాడు. ఇక కరోనా లాక్ డౌన్ పూర్తిగా తీసిన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేస్తోంది చిత్రబృందం. ఇక ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలోనూ చైతన్య ఓ సినిమా చేస్తున్నాడని సమాచారం.

Tags :
|
|

Advertisement