అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద హీరోగా ఎంట్రీ
By: chandrasekar Mon, 13 July 2020 10:19 AM
బాలీవుడ్ బాద్షా, బిగ్బీ
అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ప్రముఖ నిర్మాత
కరణ్ జోహార్ సినిమాతో. బాలీవుడ్లో బంధుప్రీతి పై ఎన్ని విమర్శలు వస్తున్నా ఆ
పరంపర ఆగడం లేదు.
మరో వంశాంకురం సినిమా
ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్పుత్ మరణంతో బంధుప్రీతికి
సంబంధించి విమర్శలు ఎక్కువగా ఎదుర్కొన్నది ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్. కేవలం
స్టార్ నటుల వారసత్వాన్నే ప్రోత్సహిస్తున్నారనేది ఈయనపై ఉన్న ఆరోపణ. అయితే ఈ
విమర్శలు ఓ వైపు వస్తున్నా మరో స్టార్ వారసుడిని రంగంలో దించడానికి సన్నాహాలు
చేస్తున్నారు కరణ్ జోహార్.
బాలీవుడ్ బాద్షా, బిగ్బీ
అమితాబ్ బచ్చన్ మనవడైన అగస్త్యానందను హీరోగా పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అమితాబ్ వారసుడిగా అభిషేక్ బచ్చన్ హిందీ చలనచిత్ర పరిశ్రమలో
ప్రవేశించినా ఆశించినంతగా గుర్తింపు సాధించలేకపోయారు.ఇప్పుడు అమితాబ్ బచ్చన్
కుమార్తె శ్వేతాబచ్చన్ నందా కుమారుడైన
అగస్త్యానందను హీరోగా దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నారు.
వయస్సు కేవలం 20 ఏళ్లే
అయినా సోషల్ మీడియాలో అగస్త్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. తన కుమారుడు అగస్త్య
బాలీవుడ్ ఎంట్రీ త్వరలో ఉంటుందని
అతని తల్లి శ్వేతా నంద గతంలోనే
ప్రకటించారు. నెపోటిజమ్పై వస్తున్న విమర్శల్లో నిజం ఉన్నా లేకపోయినా మరో వారసుడు
మాత్రం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యాక్టింగ్ లో మెళుకువలు, బాడీ షేప్అప్
విషయంలో అగస్త్య జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.