ఇన్స్టాగ్రామ్లో ఫోటోలకి ఫోజులిచ్చిన అమలా పాల్
By: chandrasekar Mon, 20 July 2020 1:33 PM
చరణ్ తో "నాయక్"
బన్నీతో "ఇద్దరమ్మాయిలతో" సినిమాల్లో నటించిన అమలాపాల్ ప్రస్తుతం
తమిళం, మలయాలం
సినిమాలతో బిజీ అయింది. మధ్య మధ్యలో కొత్త ఫోటో షూట్లను తన సోషల్ మీడియాలో
పోస్ట్ చేస్తూ అందాలతో అదరగొడుతోంది.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో
వైన్ తాగుతూ ఫోటోలకి ఫోజులిచ్చింది. తన ఫోటోలకి పెద్ద కలలు కనండి అనే
కామెంట్తో పాటు మీకు మీరే పార్టీ చేసుకోండి, మీ దుర్గుణాలను పాజిటివ్గా మలచుకోండి. సింపుల్గా
జీవించండి. చాలా నేర్చుకోండి అంటూ అమలాపాల్ పేర్కొంది.
తలైవా సినిమా షూటింగ్
సమయంలో చిత్ర దర్శకుడు ఏఎల్ విజయ్తో ప్రేమలో పడ్డ అమలా పాల్ 2014లో
పెళ్లి చేసుకుంది. 2017లో ఆయన నుండి విడాకులు తీసుకున్నారు. రీసెంట్గా
సింగర్ బవ్నీందర్ సింగ్ తో ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. అతడితో అమల
సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.