అల్లు అరవింద్ పై అల్లు అర్జున్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు...!
By: Anji Sun, 15 Nov 2020 1:14 PM
తెలుగు సినీ పరిశ్రమలో అల్లు ఫ్యామిలీది సుదీర్ఘ ప్రస్థానం. ఆ రోజుల్లోనే వెండితెరపై అల్లు రామలింగయ్య చూపిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయాయి. ఆ తర్వాత అల్లు అరవింద్ నిర్మాతగా సత్తా చాటుతూ ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు.
ఇక ఇప్పుడు అల్లు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అల్లు అర్జున్, అల్లు శిరీష్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోచిస్తూ ప్రేక్షకులకు చేరువవుతూ వస్తోంది టోటల్ అల్లు ఫ్యామిలీ. ఈ క్రమంలోనే 'ఆహా' పేరుతో ఓటీటీ వేదిక ప్రారంభించారు.
దీపావళి సందర్భంగా ఈ 'ఆహా' ఓటీటీ తరఫున హైదరాబాద్లో భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అల్లు అర్జున్ హాజరు కాగా.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు విచ్చేసి సందడి చేశారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ తన తండ్రి అల్లు అరవింద్పై ప్రశంసలు గుప్పించారు. పూర్తిగా తెలుగు కంటెంట్తో ప్రేక్షకులను అలరిస్తున్న 'ఆహా' వేదిక తెలుగు ప్రేక్షకులకు బెటర్ ఛాయిస్ అవుతుందని అన్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమ విశేషాలను, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అల్లు అర్జున్.. ''తెలుగు ఓటీటీకి గ్రాండ్ ఫాదర్గా నిలిచిన మా నాన్న అల్లు అరవింద్ గారిని చూస్తుంటే గర్వంగా ఉంది.
అల్లు కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అద్భుతమైన ఈవెంట్ ఇది. ఆహా బృందం మొత్తానికి శుభాకాంక్షలు'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీ చేస్తున్నారు అల్లు అర్జున్.
ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్. లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇందులో అల్లు అర్జున్ మాసిన గడ్డంతో మాస్ లుక్లో కనిపించనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.