వైఎస్ రాజశేఖర్ రెడ్డి 'యాత్ర' దర్శకుడితో స్టైలిష్ స్టార్ ..?
By: Sankar Tue, 14 July 2020 7:57 PM
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రం ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్లాల్సింది. కరోనా ప్రభావంతో షూటింగ్ను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సినిమా గురించి బన్ని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ విరామ సమయాన్ని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొత్త స్క్రిప్ట్లు కూడా వింటున్నారు.
ఈ నేపథ్యంలో బన్ని తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. దర్శకుడు మహి వి రాఘవ్ చెప్పిన ఓ లైన్ బన్నిని బాగా ఆకట్టుకుందట. ఈ సినిమా చేయడానికి తాను సుముఖంగా ఉన్నానని, పూర్తి స్థాయి స్క్రిప్ట్తో మరోసారి కలవమని దర్శకుడికి సూచించాడట. వాణిజ్యపంథాలో వినూత్న కాన్సెప్ట్ కావడంతో బన్ని ఈ సినిమాను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదేనని ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది.
అయితే మహి వి రాఘవ్ ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్రకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే ..ఆ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది ..ఇక మరోవైపు అల్లు అర్జున్ కూడా ఈ ఏడాది అల వైకుంఠపురం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే ..