- హోమ్›
- వినోదం›
- బుల్లితెరపై అత్యధిక టిఆర్పి రేటింగ్ తో దుమ్ము దులిపిన స్టయిలిష్ స్టార్ అలా వైకుంఠపురం..
బుల్లితెరపై అత్యధిక టిఆర్పి రేటింగ్ తో దుమ్ము దులిపిన స్టయిలిష్ స్టార్ అలా వైకుంఠపురం..
By: Sankar Thu, 27 Aug 2020 3:25 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా సినిమా అలా..వైకుంఠపురం ...సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. పలు చోట్ల బాహుబలి రికార్డులు కూడా తిరగరాసిన ఈ చిత్రం తాజాగా బుల్లితెరపై సునామి సృష్టించింది.
ఇటీవల టీవీలో ప్రసారం అయిన ఈ సినిమా అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి రికార్డు బ్రేక్ చేసింది. తెలుగులో ఇదే అత్యధికం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు మహేష్బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టాలీవుడ్లో అత్యధిక టీఆర్పీ మూవీగా 23.4 టిఆర్పిని సాధించింది. ఇక బుల్లితెరపై కూడా తమ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది.
కాగా, ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. సినిమాలోని ప్రతి పాట ఓ సంచలనం. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్కి యూట్యూబ్లో వంద కోట్ల వ్యూస్ వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమా ఆల్బమ్కి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే తొలిసారి. సినిమా విడుదలై దాదాపు తొమ్మిది నెలలు కావొస్తున్న రికార్డుల హోరు మాత్రం తగ్గడం లేదు.