Advertisement

  • ఆర్జీవీ మర్డర్ సినిమా విడుదలకు తొలగిన అడ్డంకులు

ఆర్జీవీ మర్డర్ సినిమా విడుదలకు తొలగిన అడ్డంకులు

By: Sankar Tue, 08 Dec 2020 12:54 PM

ఆర్జీవీ మర్డర్ సినిమా విడుదలకు తొలగిన అడ్డంకులు


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరోక వివాదాస్పద చిత్రం మర్డర్ త్వరలో థియేటర్లలో సందడి చేయబోతుంది...తాజాగా మర్డర్‌ సినిమా విడుదలకు సంబంధించిన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్’ను ఆయన పోస్ట్‌ చేశారు. అదే విధంగా ‘మర్డర్‌ మూవీ విడుదలకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలిగిపో​యాయి.

ఇక థీయేటర్లలో చంపడానికి ‘మర్డర్‌’ సినిమా త్వరలోనే రాబోతుంది’అని ఆయన కాప్షన్‌ జతచేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌, పాట అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన ఆ పాటను ఆర్జీవీ పాడటం విశేషం. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు.

కాగా తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్‌ మూవీని నిర్మించాడని ట్రైలర్‌, పాటలో వాస్తవాలకు దూరంగా ఉన్న అంశాలను చూపించాడని ఆమృత తీవ్ర అభ్యత్తరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నల్గొండలో జరిగిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా ఆర్జీవీ ‘మర్డర్‌’ చిత్ర తెరకెక్కించినట్లు చిత్రం ట్రైలర్‌, పాటను చూస్తే అర్థమవుతోంది. దీంతో మర్డర్‌ సినిమా విడుదల నిలిపివేయాలని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి నల్గొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ అనంతరం సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్‌ను కోర్టు ఆదేశించింది.

Tags :
|
|
|

Advertisement