Advertisement

  • దీపావళి కానుకగా కొత్త సినిమా ప్రకటించిన బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్

దీపావళి కానుకగా కొత్త సినిమా ప్రకటించిన బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్

By: Sankar Sun, 15 Nov 2020 3:26 PM

దీపావళి కానుకగా కొత్త సినిమా ప్రకటించిన బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్


బాలీవుడ్ కిలాడీ హీరో అక్షయ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు . హిట్లు ఫ్లాపులు తో అక్షయ్ కు సంబంధం లేదు...పెద్ద సినిమా చిన్న సినిమా అని పట్టించుకోడు. ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు అక్షయ్.

బాలీవుడ్ లో ఖాన్ త్రయానికి దీటుగా నిలబడిన ఏకైక హీరో ఎవరంటే టక్కున చెప్పొచ్చు అక్షయ్ కుమార్ అని.ఇటీవల లక్ష్మీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్షయ్. త్వరలో అక్షయ్ నటించిన సూర్యవంశీ సినిమాకూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా దీపావళి సందర్భంగా నూతన చిత్రం ‘రామసేతు’ ప్రకటించాడు.

అభిషేక్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశాడు. ‘ ఈ దీపావళి అందరికీ సంతోషాలను ఇవ్వాలి. శ్రీరాముడు ఆదర్శాలను మనమంతా పాటిస్తూ ఆదర్శవంతంగా ముందుకుసాగుదాం. అంటూ అక్షయ్ ట్వీట్ చేశారు.

Tags :

Advertisement