అమితాబ్ ఫ్యామిలీలో మరో ఇద్దరికీ కరోనా ..ఐశ్వర్య రాయ్ మరియు కూతురు ఆరాధ్యకు పాజిటివ్
By: Sankar Sun, 12 July 2020 3:31 PM
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్యర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాటివ్గా అధికారులు గుర్తించారు. ఇప్పటికే బిగ్బీ అమితాబచ్చన్, ఆయన కుమారు అభిషేక్ బచ్చన్ కూడా వైరస్ బారినపడగా శనివారం రాత్రి నానావతి దవాఖానలో ఐసోలేషన్ యూనిట్లో చేరారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ముంబై బీఎంసీ మేయర్ కిశోర్ పడ్నేకర్ ఆదివారం తెలిపారు.
జయాబచ్చన్, ఐశ్యర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా నెగెటివ్గా వచ్చిందని తెలిపిన కొద్ది సమయానికే రెండో విడత పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్కు కరోనా పాజిటివ్ రావడంతో వారు నివసించే ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. భవవనానికి బీఎంసీ అధికారులు సీల్ వేశారు. బిల్డింగ్ బయట కంటైన్మెంట్ జోన్ అని నోటీస్ అతికించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేశారు.
అయితే దిగ్గజ నటుడైన అమితాబ్ బచ్చన్ ఫామిలీలో ఇలా నలుగురికి కరోనా సోకడంతో దేశంలో దేశం మొత్తం వారి అభిమానులు ఆందోళనలో ఉన్నారు..కాగా ఇప్పటికే మరొక దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ఫ్యామిలీలో కూడా కరోనా బారిన పడ్డారు .. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ ఆదివారం ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు