Advertisement

  • బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్...!

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్...!

By: Anji Wed, 23 Dec 2020 10:30 PM

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్...!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు.

తెలుగుచిత్ర సీమలో హిట్ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకుంది. తనదైన నటనతో అందరిని అలరించి లక్కీ బ్యూటీ బిరుదును సంపాదించింది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి అరంగేట్రం ఇచ్చేందుకు చూస్తోంది.

పర్వీజ్ షేక్, అసీమ్ అరోరాలు ఈ సినిమా కథను రాశారు. ఇందులో సిద్దార్థ్ మల్‌హోత్రా, రష్మికాలు ప్రధాన పాత్రల్లో చేయనున్నారు. ఈ సినిమా గుల్టీ, ఆర్ఎస్‌వీపీ బ్యానర్‌లపై గరిమమెహ్తా నిర్మిస్తున్నారు.

ఈసినిమా టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందనే వచ్చింది. ఈ చిత్రంలో సిద్దార్థ్ రాఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా 1970లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చిత్రీకరించబడనుంది.


ఈసినిమా భారత రా ఏజెంట్‌లు చేసిన అత్యంత ప్రమాదకర మిషన్‌లను చూపించనున్నారు. మరి లక్కీ బ్యూటీ లక్ బాలీవుడ్‌లో కూడా వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి.

Tags :

Advertisement