Advertisement

Breaking News: అమితాబ్ తో రకుల్ జోడీ..!

By: Anji Fri, 20 Nov 2020 12:22 PM

Breaking News: అమితాబ్ తో రకుల్ జోడీ..!

బిగ్ బి' అమితాబ్ బచ్చన్ కథానాయకుడుగా ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే.. ఓ ముఖ్య పాత్రలోనూ కనిపించనున్నారు అజయ్. ఆయన పైలట్ రోల్లో ఆకట్టుకోనున్నారు. తాజాగా నాయిక వివరాలు వెల్లడించింది చిత్రబృందం. అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవుతోంది. కో పైలట్గా దర్శనమివ్వనుంది.

అమితాబ్తో నటించాలనే నా కల నెరవేరబోతుంది. అజయ్ దేవగణ్ నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని ట్వీట్ చేసింది రకుల్.

ఈ డిసెంబరులో హైదరాబాద్లో షూటింగ్ మొదలవుతుంది. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'మేడే' అనే టైటిల్ ఖరారు చేశారు.

అజయ్ దేవగణ్కు దర్శకత్వం చేయడం కొత్తేమీ కాదు. 2008లో 'యు మీ ఔర్ హమ్' చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇందులో కాజోల్ కథానాయిక. ఈ సినిమాకు రచన, నిర్మాణ బాధ్యతలను కూడా అజయ్ చూసుకున్నారు. ఇప్పుడు 'మేడే' కోసం మరోసారి యాక్షన్ చెప్పబోతున్నారు.

Tags :

Advertisement