భర్తను మేనేజర్ గా పెట్టుకున్న స్టార్ హీరోయిన్
By: Sankar Sun, 26 July 2020 10:59 AM
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అలరించిన ప్రియమణి ప్రస్తుతం పలు షోస్కి జడ్జిగా ఉంటూ కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్లలో పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రియమణి తాజా ఇంటర్యూలో ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. తను ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తకి తన దగ్గరే జాబ్ ఇచ్చిందని పేర్కొంది.
కొన్నేళ్ళ క్రితం ముస్తఫా రాజ్ని ప్రేమ వివాహం చేసుకున్న ప్రియమణి ఇప్పుడు ఆయనని తన మేనేజర్గా నియమించుకుందట. కాల్షీట్స్ తదితర అంశాలు అన్నీ ఆయనే చూస్తాడట. తన కోసం ముస్తఫా చాలా కష్టపడతాడంటూ పేర్కొంది ప్రియమణి. తెలుగులో విరాటపర్వం మరియు నారప్ప చిత్రాల్లో నటించిన ఈమె హిందీలో మైదాన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుంది. బుల్లి తెరపై కూడా ఈమె ‘ఢీ’ షోలో జడ్జిగా కనిపిస్తుంది.
అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి జాతీయ అవార్డు కూడా గెకుచుకున్న ప్రియమణి ప్రస్తుతం నారప్ప , విరాట పర్వంలో కీలక పాత్రల్లో నటిస్తుంది ..ఆ చిత్రాల నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ..విరాటపర్వంలో నక్సలైట్ గా , నారప్పలో అచ్చమైన పల్లెటూరి పాత్రలో ఇలా ఒకేసారి రెండు విభిన్న పాత్రలతో అభిమానులను అలరించేందుకు ప్రియమణి సిద్ధంగా ఉన్నారు