Advertisement

అనగనగా ఓ అతిథి ఈ రోజే వచ్చాడు...!

By: Anji Fri, 20 Nov 2020 1:27 PM

అనగనగా ఓ అతిథి ఈ రోజే వచ్చాడు...!

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో కథానాయికగా తెలుగువారికి చేరువైన నటి పాయల్‌ రాజ్‌పూత్‌ మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు.

ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దయాల్‌ పద్మనాభం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్‌ ప్రతి నాయకురాలి ఛాయలున్న పాత్రలో నటించారు.

‘మన కష్టాలన్నీ తీరడానికి ఒకటే దారుంది.. ఆడి సావు మన సేతుల్లోనే ఉంది. అదే విధి.’; ‘కూరకి కోడిని నువ్వు కొయ్యి.. కూర తిన్నోడ్ని..’ అంటూ పాయల్‌ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. నవంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Advertisement