మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్... హాజరు అయిన మెగాస్టార్
By: Sankar Thu, 13 Aug 2020 9:22 PM
మెగా డాటర్ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. హైదరాబాద్లో జరిగిన వేడుకలకు ఇరు కుటుంబాలతో పాటుగా.. అతికొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. మెగాఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేసింది. కాగా,ఈ ఏడాదిలోనే నిహారిక-చైతన్య పెళ్లి జరగనుంది.
మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ తదితరులు ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు. అయితే వీరిలో పవన్ కళ్యాణ్ ఎక్కడా దర్శనం ఇవ్వలేదు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక చైతన్య స్వస్థలం గుంటూరు కాగా.. ఇండియన్ స్కూల్ బిజినెస్లో ఎంబీఏ పూర్తిచేశారు. చైతన్య.. హైదరాబాద్లోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నట్టు సమాచారం. ఇక చైతన్య-నిహారికలకు ముందే పరిచయం ఉండటంతో ఒకర్నొకరు అర్థం చేసుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అయితే నిహారిక- చైతన్యల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో, అదేవిధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని వార్తలు రాగా.. త్వరలోనే నిశ్చితార్థం ఉంటుందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నాం అంటూ చెప్పిన నాగబాబు.. పెళ్లిని ఇలాంటి పరిస్థితుల్లో అట్టహాసంగా చేయడం కుదరదని చెప్పారు నాగబాబు.