సుదీప్ తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ
By: chandrasekar Fri, 12 June 2020 6:56 PM
ఈగ సినిమాతో తెలుగులో తనదైన
ముద్ర వేసిన కన్నడ నటుడు సుదీప్. పెర్ఫామెన్స్ పరంగా ఆ సినిమాలో అతనే హైలైట్.
సినిమా అంత పెద్ద సక్సెస్ కావడంలో అతడి పాత్ర కీలకం. తొలి సినిమాతో అంత పెద్ద
బ్రేక్ వచ్చినా తెలుగులో కెరీర్ను నిర్మించుకోలేకపోయాడు సుదీప్. యాక్షన్
త్రీడీ, బాహుబలి
సినిమాల్లో తన స్థాయికి తగని పాత్రల్లో నటించాడు.
అతడికి తగ్గ పాత్రలు
తెలుగు దర్శకులు ఇవ్వలేదా లేక అతనే ఇక్కడి అవకాశాల్ని కాదనుకున్నాడా అన్నది
తెలియదు. గత కొన్నేళ్లలో తెలుగులో మళ్లీ ఏ సినిమా చేయలేదు. ఐతే సుదీప్
తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నది తాజా సమాచారం. అతను సూపర్
స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహేష్, సుదీప్
కాంబినేషన్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. ఈ
చిత్రానికి ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. సంగీత దర్శకుడిగా మాత్రం తమన్ ఓకే అయ్యాడు.
పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం అందించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14
రీల్స్ ప్లస్ సంస్థలు ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
పరశురామ్ దర్శకత్వంలో
మహేష్ బాబు చేయబోయే కొత్త సినిమా సర్కారు వారి పాటలో సుదీపే విలన్ పాత్ర నటిస్తాడని
ఆసక్తికర ప్రచారం సాగుతోంది. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే, అందులో
ఎంత పెద్ద నటుడు నటిస్తే హీరో, అతడి పాత్ర అంతగా ఎలివేట్ అవుతాయన్న ఉద్దేశంతో
సుదీప్ను పరశురామ్ పట్టుకొస్తున్నాడని ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని
మహేష్ సినిమా కాబట్టి సుదీప్ ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు.