‘క్లైమాక్స్’ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్
By: chandrasekar Sat, 19 Sept 2020 07:44 AM
‘క్లైమాక్స్’ చిత్ర మోషన్ పోస్టర్ ను నటుడు రాజేంద్ర
ప్రసాద్ విడుదల చేశారు. అయన ఈ సినిమాలో
ముఖ్య పాత్ర పోషించారు. ఏడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అవార్డులు
గెలుచుకున్న ‘డ్రీమ్’ చిత్ర దర్శకుడు భవానీ శంకర్ తాజాగా చేసిన పొలిటికల్ సెటైర్తో
కూడిన మిస్టరీ థ్రిల్లర్ ‘క్లైమాక్స్’. ఈ చిత్ర మోషన్ పోస్టర్ని సీనియర్ నటుడు
రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై
పి.రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో
వ్యాపారవేత్తగా రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తుండగా పృథ్వీరాజ్, శివశంకర్
మాస్టర్, శ్రీరెడ్డి, సాషా
సింగ్, రమేష్, చందు
కీలక పాత్రలు పోషించారు. మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా రాజేంద్ర ప్రసాద్
మాట్లాడుతూ ‘‘భవానీ శంకర్తో గతంలో నేను ‘డ్రీం’ అనే సైకలాజికల్ థ్రిల్లర్లో పని
చేసాను. ఆ చిత్రానికి ‘రాయల్ రీల్’ అనే ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు మరో 7
అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. కానీ, అది ఒక జానర్ ప్రేక్షకులకి మాత్రమే నచ్చిందని మా
ఇద్దరి అభిప్రాయం.
నటుడు రాజేంద్ర ప్రసాద్
మాట్లాడుతూ ఈసారి కామెడీ, లవ్, ఫామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్ ఇలా అన్నీ వచ్చేలా మల్టీ జానర్ కథతో
వస్తున్నాం. ఇవన్నీ ఒకే కథలో ఎలా వస్తాయి అని మీరనుకుంటుంటే, కచ్చితంగా
‘క్లైమాక్స్’ చూడాల్సిందే. ప్రస్తుతం విడుదల చేసిన ‘క్లైమాక్స్’ చిత్ర మోషన్
పోస్టర్ మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులకి
నచ్చేలా ఉండే మా చిత్రాన్ని త్వరలోనే మీ అందరి ముందుకు తీసుకొస్తాం’’ అని అన్నారు.
దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ ‘‘పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో
తెరకెక్కించిన చిత్రం ‘క్లైమాక్స్’. చిత్రీకరణ పూర్తయి విడుదలకి సిద్ధంగా ఉన్న మా
చిత్రంలో రాజేంద్రప్రసాద్ సహా మిగితా పాత్రలు చాలా థ్రిల్లింగ్గా, ఆకట్టుకునే
విధంగా ఉంటాయి. మొదటి సారి ఒక మల్టీ జానర్ చిత్రంతో రాబోతున్నాం. మోషన్ పోస్టర్ని
రాజేంద్ర ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చెప్పినట్టుగానే మా
చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. అలాగే ‘క్లైమాక్స్’కి సంబందించిన
మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అని అన్నారు. ఈ థ్రిల్లింగ్
సినిమా కోసం ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.