Advertisement

బడ్జెట్ తగ్గించే యోచనలో ఆచార్య ..?

By: Sankar Mon, 08 June 2020 8:45 PM

బడ్జెట్ తగ్గించే యోచనలో ఆచార్య ..?

కరోనా మహమ్మారి అన్ని రంగాలతోపాటు సినీ రంగాన్ని కూడా కోలుకోలేని దెబ్బకొట్టింది. లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ కొన్ని కోట్ల రూపాయలను కోల్పోయింది. ఇకపై పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. అందుకే సినిమా బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సినీపెద్దలు భావిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం `ఆచార్య`. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్ ముగియగానే వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అయితే ముందు అనుకున్న బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్‌లో సినిమాను ముగించాలని చిరంజీవి స్పష్టం చేశారట. షూటింగ్‌ను తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పారట. ఆ మేరకు దర్శకుడు కొరటాల కథలో మార్పు చేర్పులు చేస్తున్నారట. `ఆచార్య` మాత్రమే కాకుండా మిగిలిన సినిమాలన్నీ ఇదే బాటలో పయనిస్తున్నాయట.

ఇక తెలంగాణలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు నిర్వహించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని తెలిపారు.


Tags :

Advertisement