Advertisement

  • కొత్త మలుపులు తిరుగుతున్న సినీ నటుడు విశాల్ 45 లక్షల వ్యవహారం

కొత్త మలుపులు తిరుగుతున్న సినీ నటుడు విశాల్ 45 లక్షల వ్యవహారం

By: Sankar Tue, 07 July 2020 10:54 AM

కొత్త మలుపులు తిరుగుతున్న సినీ నటుడు విశాల్ 45 లక్షల వ్యవహారం



సినీ నటుడు విశాల్ ఇంట్లో 45 లక్షలు మాయం అయినా కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి..ఇప్పటి వరకు విశాల్ ఆఫీస్ లో పని చేసే మహిళా ఆ డబ్బులు కాజేసింది అని భావించారు ...తాను ఆదాయ శాఖకు చెల్లించాల్సిన టీడీయస్‌ను రమ్య ఆమె భర్త బ్యాంక్‌ అకౌంట్లు,తన బంధువుల బ్యాంకు అకౌంట్లో తరలింందని విశాల్ పేర్కొన్నారు. కాబట్టి ఆమెను విచారించాలని కోరారు.. అయితే తాజాగా విశాల్ మీద ఆ మహిళా సంచలన వ్యాఖ్యలు చేసారు ..

ఆమె ఒక ఛానల్లో భేటీ ఇస్తూ విశాల్ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి టీడీయస్‌ను చెల్లించకుండామోసానికి ´పాల్పడుతున్నారని, దాని నుంచి తప్పిచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.విశాల్ కార్యనిర్వాహకుడు హరి వర్గం తన ఇంటికి వచ్చిబెదిరించారని ఆరోపింంది. విశాల్ కు సంబంధించిన చాలా విషయాలు తనకు తెలుసని చెప్పింది.పోలీసులు తనకు రక్షణ కల్పిస్తే మరిన్ని నిజాలను బయట పెడతా అని అన్నారు ..

కాగా విశాల్ కు నటుడిగా దక్షిణ సినీ పరిశ్రమలోమంచి పేరుంది. ఈయన నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన చక్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈయనకు స్థానిక వడపళని, కుమరన్∙కాలనీలోని చిత్ర నిర్మాణ కార్యాలయం ఉంది. అందులో పది మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. నటుడు విశాల్ కొంత కాలంగా ఆదాయశాఖ సంస్థకు డీయస్‌ను చెల్లించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఆరా తీయగా తనకార్యాలయంలో రూ.45 లక్షలు మోసం జరిగిందన్న విషయం వెలుగు చూసిందట..

Tags :
|

Advertisement