నిర్మాతలకు అధిక లాభాలు ఇవ్వని ఓటిటీ వేదిక
By: chandrasekar Thu, 04 June 2020 7:06 PM
ఓటిటీ వేదికగా సినిమాలు
విడుదల చేయడం సినిమా ప్రియులకు ఆనందకరమే కానీ నిర్మాతలకు మాత్రం ఇది లాభదాయకం
కాదు. కంటెంట్ నిజంగా బ్రహ్మాండంగా వుంటే జనం ఎగబడి చూస్తారు. ఫలానా సినిమా
చూడమంటూ పదిమందికి చెప్తారు.
సినిమా అంతంతమాత్రంగా
ఉన్నట్టయితే ఓటిటీలో ఫ్రీగా చూడ్డానికి కూడా జనం అంతగా ఇష్టపడరు. తమిళం నుంచి
విడుదలైన జ్యోతిక సినిమా పోన్మగల్ వందాల్ కి ప్రచారం విపరీతంగా జరిగింది. విడుదలకి
ముందు చాలా వివాదాలు కూడా సినిమాను వార్తల్లో ఉంచాయి. సూర్య నిర్మాత కావడం మరో
పబ్లిసిటీ. అయితే ఇంత ప్రచారం పొందిన ఆ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో చూసినవాళ్లు
పెదవి విరిచారు. విమర్శకులు కూడా మెచ్చుకోలేదు. దీంతో ఆ చిత్రానికి అంతగా ఆదరణ
లేదు. చిన్న సినిమా కనుక ఓటిటీ ఇచ్చిన అమౌంట్ ఓకే అయి ఉండొచ్చు. కానీ పెద్ద
సినిమాలకు వ్యూస్ కూడా చాలా అవసరం.
నెట్ లో సినిమా పెడితే
పైరేట్స్ చేతిలో ఫుల్ హెచ్ డి ప్రింట్ పెట్టినట్టే. ఫలానా ఓటిటీలో ఉంది కదా అని
జనం దానికి సబ్స్క్రయిబ్ చేసుకోరు. డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. అప్పుడు సదరు
వ్యూస్ కౌంట్ లోకి రావు. ఇన్నిరకాల తలనొప్పులు ఉండడంతో కోట్ల పెట్టుబడి పెట్టిన
సినిమాని బొమ్మల పెట్టెలో చూపించడానికి నిర్మాతలు ఇష్టపడడం లేదు. ఆలస్యమయినా కానీ
థియేటర్లు ఓపెన్ అయ్యాక విడుదల చేసుకుందాం అని వేచి చూస్తున్నారు.