Advertisement

నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్...!

By: Anji Sun, 27 Sept 2020 1:38 PM

నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్...!

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా శనివారం దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్లను అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో రకుల్ ప్రీత్, దీపికా పదుకొణె, కరిష్మా ప్రకాశ్, ఖంబాటాల మొబైల్ ఫోన్లు ను సీజ్ చేసినట్లు ఓ ఎన్సీబీ అధికారి వెల్లడించారు.

దీపిక, రకుల్లను ఐదు గంటలపాటు ఈ కేసుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఖంబాటా శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరుకాగా.. దీపిక మేనేజర్ కరిష్మా వరుసగా రెండో రోజూ విచారణకు వచ్చింది.

వారి చరవాణుల్లో డ్రగ్స్ చాట్కు సంబంధించిన ఆధారాలను ఎన్సీబీ సేకరించినట్లు సమాచారం. వీరితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్ జయ సాహా మొబైల్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో కలిపి ఇప్పటికి 18 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. రియాకు రకుల్ప్రీత్, సిమోన్ ఖంబాటాలు సన్నిహితులు కావడం వల్లే వారి సెల్ఫోన్స్ సీజ్ చేశారని తెలుస్తోంది.

Tags :

Advertisement