లాభాలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్
By: chandrasekar Sat, 30 May 2020 4:54 PM
శుక్రవారం బెంచ్మార్క్
సూచీలు దుమ్మురేపాయి. లాభాలతో దూసుకెళ్లాయి. జనవరి- మార్చి త్రైమాసికపు జీడీపీ
గణాంకాల విడుదలకు ముందుసాయంత్రం 5:30 గంటలకి మార్కెట్ పైకి కదలడం గమనార్హం. బెంచ్మార్క్
సూచీలు రోజులో చాలా వరకు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. మధ్యాహ్నం తర్వాత లాభాల
మొదలయ్యాయి.
శుక్రవారం ఇంట్రాడేలో
సెన్సెక్స్ 377 పాయింట్లు వరకు నష్టపోయింది. 31,823 పాయింట్ల కనిష్టానికి క్షీణించింది. నిఫ్టీ కూడా 9376
పాయింట్ల దిగువకు పడిపోయింది. కన్సూమర్ గూడ్స్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా
ఇండెక్స్లు లాభాల్లోకి వచ్చాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 224
పాయింట్ల లాభంతో 32,424 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 9569 పాయింట్ల వద్ద
క్లోజయ్యాయి. నిఫ్టీ 50లో ఐఓసీ, విప్రో, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు లాభపడ్డాయి.
ఐఓసీ ఏకంగా 7 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
యాక్సిస్ బ్యాంక్, భారతీ
ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, టైటన్ షేర్లు నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్ 2
శాతానికి పైగా పడిపోయింది. నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా
క్లోజయ్యాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా మినహా మిగతా ఇండెక్స్లు అన్ని
లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిప్టీ
మెటల్ ఇండెక్స్లు 1 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ఫార్మా 3 శాతం, నిఫ్టీ
రియల్టీ 4 శాతం, నిఫ్టీ
ఎఫ్ఎంసీజీ 3 శాతం చొప్పున పరుగులు పెట్టాయి.
అమెరికా డాలర్తో
పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 14 పైసలు లాభంతో 75.62 వద్ద
కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి.
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 2.97 శాతం తగ్గుదలతో 34.98 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు
3.35 శాతం
క్షీణతతో 32.58 డాలర్లకు తగ్గింది.