Advertisement

  • స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో ఆపిల్ ను క్రాస్ చేసిన శామ్‌సంగ్

స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో ఆపిల్ ను క్రాస్ చేసిన శామ్‌సంగ్

By: Sankar Sun, 22 Nov 2020 3:45 PM

స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో ఆపిల్ ను క్రాస్ చేసిన శామ్‌సంగ్


ఈ ఏడాది 3వ త్రైమాసికం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో శామ్‌సంగ్, ఆపిల్‌ను దాటేసింది. ప్రముఖ రీసెర్చ్ సంస్థ కానలిస్ తాజాగా 2020 మూడో త్రైమాసికంలో(జులై-సెప్టెంబర్) స్మార్ట్ ఫోన్ మార్కెట్ రిపోర్టును విడుదల చేసింది.

ఈ రిపోర్టు ప్రకారం ఈ త్రైమాసికంలో 34.8 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి. 2020 మూడో త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్‌సంగ్ తిరిగి మొదటి స్థానాన్ని పొందగలిగింది. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న మొదటి పది స్మార్ట్‌ఫోన్‌లలో ఐదు మొబైల్ ఫోన్లు శామ్‌సంగ్ తయారు చేసినట్లు కానలిస్ నివేదిక తెలిపింది.

ప్రముఖ రీసెర్చ్ సంస్థ కానలిస్ నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం, గెలాక్సీ ఎ21ఎస్ ఫోన్లు ఈ ఏడాది 3వ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ లు. గెలాక్సీ ఎ21ఎస్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మూడవ మొబైల్ ఫోన్. గెలాక్సీ A11(10 మిలియన్లు), గెలాక్సీ A51(8 మిలియన్), గెలాక్సీ A31(5 మిలియన్లు), గెలాక్సీ A01కోర్(4 మిలియన్) ఫోన్లు నాలుగవ, ఐదవ, ఎనిమిదవ, పదవ స్థానాలలో నిలిచాయి

Tags :
|
|
|

Advertisement