Advertisement

షాకిస్తున్న పెట్రోల్ ధరలు..వరుసగా ఆ రోజు పెరుగుదల

By: Sankar Tue, 25 Aug 2020 4:44 PM

షాకిస్తున్న పెట్రోల్ ధరలు..వరుసగా ఆ రోజు పెరుగుదల


వాహనదారులకు షాక్. పెట్రోల్ ధర పెరుగుతూనే వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పెట్రోల్ ధర పెరగడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం. పెట్రోల్ ధర పెరిగినా కూడా డీజిల్ ధర మాత్రం నిలకడగానే ఉంది. దీంతో హైదరాబాద్‌‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర 11 పైసలు పెరుగుదలతో రూ.84.94కు చేరింది. డీజిల్ ధర నిలకడగా రూ.80.17 వద్ద కొనసాగింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. 11 పైసలు పెరుగుదలతో రూ.81.73కు చేరింది. డీజిల్ ధర స్థిరంగా రూ.73.56 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 11 పైసలు పెరుగుదలతో రూ.88.39కు చేరింది. డీజిల్ ధర రూ.80.11 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.18 శాతం పెరుగుదలతో 45.72 డాలర్లకు ఎగసింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.09 శాతం తగ్గుదలతో 42.58 డాలర్లకు క్షీణించింది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.


Tags :
|
|
|
|

Advertisement