Advertisement

కేంద్రం గుడ్ న్యూస్.. NPS స్కీమ్ ఇన్వెస్టర్లకు ..!

By: Anji Mon, 28 Sept 2020 2:36 PM

కేంద్రం గుడ్ న్యూస్.. NPS స్కీమ్ ఇన్వెస్టర్లకు ..!

కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS పేరుతో ఒక స్కీమ్ అందిస్తున్న విషయం తెలిసిందే. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. ఇప్పుడు మోదీ సర్కార్ ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది.

రానున్న రోజుల్లో ఎన్‌పీఎస్ స్కీమ్‌లో కూడా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ SIP రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. దీంతో ఇన్వెస్టర్లకు కూడా ఈ స్కీమ్ ఆకర్షణీయంగా మారనుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పూర్తి కసరత్తు అంతిమ దశకు వచ్చినట్లు తెలుస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ PFRDA ఎన్‌పీఎస్ స్కీమ్‌కు సంబంధించి రానున్న రోజుల్లో సిప్ ఆప్షన్ విషయాన్ని ప్రకటించబోతోంది.

దసరా పండుగ కల్లా ఈ నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 25న దసరా. ఎన్ఎస్‌డీఎల్ ఇవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా మాట్లాడుతూ అతిత్వరలో ఎన్‌పీఎస్ సిప్ సర్వీసులు అందుబాటులోకి రావొచ్చని తెలిపారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. ఇక మ్యూచువల్ ఫండ్స్ Mutual Funds లో ఎలాగైతే ప్రతి నెలా సిప్ రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో.. ఎన్‌పీఎస్‌లో కూడా అలాగే మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. సబ్‌స్క్రైబర్లు ఆటోమేటెడ్ బ్యాంక్ పేమెంట్స్‌ను సెట్ చేసుకోవచ్చు.

దీంతో ప్రతి నెలా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఇకపోతే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను Tax ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అంతేకాకుండా మరో రూ.50000 వరకు అదనపు పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. ఇది సెక్షన్ 80సీ రూ.1.5 లక్షల మినహాయింపునకు అదనం.

Tags :

Advertisement