Advertisement

  • జియోలో వాటా కొనుగోలు చేసిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్

జియోలో వాటా కొనుగోలు చేసిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్

By: chandrasekar Sat, 06 June 2020 3:06 PM

జియోలో వాటా కొనుగోలు చేసిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్


తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), అలాగే అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ మధ్య భాగస్వామ్య ఒప్పందం జరిగింది. జియో ప్లాట్ ఫామ్స్ లో పెట్టుబడుల వరద కొనసాగుతోంది.

ఇందులో భాగంగా రూ .9,093.60 కోట్లను జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ముబదాలా పెట్టుబడి ప్రాతిపదికన చూస్తే ఇది జియో ప్లాట్‌ఫామ్‌లలో 1.85 శాతం ఈక్విటీ వాటాగా మారుతుంది.

ఇప్పటికే జియో ప్లాట్‌ఫాంలో ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, సహా తాజాగా ముబదాలా ఇన్వెస్ట్ మెంట్ పెట్టుబడవతో ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ, ఇన్వెస్టర్ల నుంచి రూ .87,655.35 కోట్ల పెట్టుబడులను కేవలం ఆరు వారాల్లోపు సేకరించింది.

Tags :
|
|

Advertisement