ఎయిర్టెల్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి మాస్టర్ కార్డ్
By: chandrasekar Wed, 27 May 2020 6:17 PM
ఎయిర్టెల్ పేమెంట్స్
బ్యాంక్తో జతకట్టిన మాస్టర్ కార్డ్. పేమెంట్స్ సంబంధించిన కస్టమైజ్డ్
సొల్యూషన్స్ కోసం ఈ ఇరు సంస్థలు చేతులు కలిపాయి. రైతులు, ఎస్ఎంఈలకు ట్యాప్ అండ్ పే ఎన్ఎఫ్సీ, క్రెడిట్ ఫెసిలిటీ సహా ఇతర బ్యాంకింగ్ సర్వీసులు
అందించడమే లక్ష్యంగా ఈ కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. భాగస్వామ్యం ద్వారా
బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులోలేని కస్టమర్లకు ఈ సర్వీసులు అందించాలని, డిజిటల్ వినియోగాన్ని పెంచాలనే ఇరు సంస్థలు
భావిస్తున్నాయి.
రైతులకు ఆధునాతన వ్యవసాయ
టెక్నిక్స్ గురించి తెలియజేయడం, వారిని
మార్కెట్ప్లేస్లతో అనుసంధానం చేయడం, ఎయిర్టెల్
పేమెంట్స్ బ్యాంక్లోకి నేరుగా పేమెంట్స్ పొందటం వంటి వాటి కోసం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్
ఏర్పాటు లక్ష్యంగా భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
తెలిపింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు 4 కోట్ల
మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లను కలిగి ఉంది.
కొత్త సొల్యూషన్స్ ద్వారా
రైతులకు ఎక్కువ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని, వారి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు పొందొచ్చని, నగదు రిస్క్ల నుంచి రక్షణ లభిస్తుందని, రుణ లభ్యత ఉంటుందని మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్
పోరుస్ సింగ్ తెలిపారు. కస్టమర్లు, మర్చంట్లకు
ఎన్ఎఫ్సీ ద్వారా కాంటాక్ట్లెస్ పేమెంట్స్ సర్వీసులు అందించేందుకు ఎయిర్టెల్
పేమెంట్స్ బ్యాంక్, మాస్టర్
కార్డ్ కలిసి పనిచేయనున్నాయి. ఇకపోతే ఈ ఇరు కంపెనీలు పలు రకాల సేవల కోసం గత
మూడేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి. ఎయిర్టెల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్
కస్టమర్లకు కూడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్స్ లభిస్తాయి.