Advertisement

ఒక కేజీ ధర రూ.3 లక్షల పైమాటే... ఇంతకీ అవేంటో తెలుసా...?

By: Anji Tue, 17 Nov 2020 5:35 PM

ఒక కేజీ ధర రూ.3 లక్షల పైమాటే... ఇంతకీ అవేంటో తెలుసా...?

రూ.50 పెడితే కేజీ ఉల్లిపాయలు వస్తాయి. వంకాలు, టమోటా, బంగాళాదుంపు ఇలా ఏవి కొనాలన్నా కేజీకి రూ.100లోపే ధర ఉంటుంది. కేజీ చికెన్ కొనాలంటే రూ.200 పెట్టాలి.

అదే మటన్ కొనాలంటే రూ.700 చెల్లించుకోవాలి. ఇలా దాదాపు అన్నీ కూడా అందుబాటులో ధరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు.

అయితే ఇక్కడ మాత్రం మీరు ఒక దాన్ని కొనాలంటే రూ.లక్షల్లో చెల్లించాలి. ఒక కేజీ ధర రూ.3 లక్షల పైమాటే. ఇంత ధర దేనికి ఉందని ఆలోచిస్తున్నారా? అదే కుంకుమ పువ్వు.

దీనికి ఎందుకంత ధర ఉంటుంది? ఇది అన్ని చోట్ల పండదు. జమ్మూకాశ్మీర్ పర్వతాలలో దీన్ని పండిస్తారు. అది కూడా శరదృతువులోనే.

శరదృతువులో జమ్మూకాశ్మీర్ రైతులు పొలాల్లో కుంకుమ పువ్వు మొక్కలను నాటుతారు. ఇవి చిన్నవి. ఈ మొక్కలకు బ్లూ రంగులో పూలు పూస్తాయి.

ఈ పూల నుంచే కుంకుమ పువ్వును తయారు చేస్తారు. ప్రపంచంలోని అత్యంత విలువైన మొక్కల్లో కుంకుమ పువ్వు మొక్క కూడా ఒకటిగా చెబుతుంటారు.

దాదాపు 75 వేల పువ్వుల నుంచి కేవలం 450 గ్రాముల కుంకుమ పువ్వును తయారు చేస్తారు. అందుకే దీనికి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ధర ఎక్కువగా ఉండటానికి ఇంచా ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

కుంకుమ పువ్వును మెడిషన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఫుడ్ ఐటమ్స్ తయారీలో వాడతారు. కేజీ కుంకుమ పువ్వు ధర రూ.3 లక్షల వరకు ఉంటుంది.

జమ్మూకాశ్మీర్‌లో దాదాపు 200కు పైగా గ్రామాల్లో నివాసం ఉండే వేలాది మంది రైతులు కుంకుమ పువ్వు బిజినెస్ చేస్తుంటారు.

కుంకుమ పువ్వును రెడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది జమ్మూకాశ్మీర్, పరిసర ప్రాంతాల్లో పండిస్తారు. ఈమధ్యన ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో కూడా పండించడం ప్రారంభించారు.

Tags :
|

Advertisement