Advertisement

ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్...

By: Anji Wed, 16 Sept 2020 4:01 PM

ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్...

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎస్‌బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. అర్హత కలిగిన వారికి వేగంగా రుణాలు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా చాలా బ్యాంకులు ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగస్వామ్యమయ్యాయి.

ప్రైవేట్ రంగానికి చెందిన మరో బ్యాంక్ యస్ బ్యాంక్ తాజాగా కేంద్ర ప్రభుత్వపు పీఎస్‌బీ లోన్స్ ఇన్ 59 మినిట్స్ ప్లాట్‌ఫామ్‌తో జతకట్టింది. దీంతో రుణ గ్రహీతలు ఎంఎస్ఎంఈ రుణాలు సులభంగానే పొందొచ్చు. 59 నిమిషాల్లోనే రుణం అనే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు సులభంగానే రుణాలు లభిస్తాయి. అంతేకాకుండా

పలు బ్యాంకులు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ వంటివి కూడా అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో బ్యాంక్ కూడా ఈ ప్లాట్‌ఫామ్‌తో జతకట్టింది. అదే ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్. బిజినెస్‌కు సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.

బ్యాంకులు రూ.లక్ష దగ్గరి నుంచి రూ.5 కోట్ల వరకు రుణాన్ని అందిస్తాయి. లోన్ కోసం అప్లై చేసిన 59 నిమిషాల్లోనే సూత్రప్రాయ ఆమోదం లభిస్తుంది. యస్ బ్యాంక్ (రిటైల్ బ్యాంకింగ్) గ్లోబల్ హెడ్ రాజన్ పెంటాల్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు వృద్ధి చోధకాలుగా పనిచేస్తాయని తెలిపారు. బ్యాంకులకు కూడా అధిక ప్రాధాన్యం ఉన్న రంగం ఇదని పేర్కొన్నారు. 59 నిమిషాల్లోనే రుణం ప్లాట్‌ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.


లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావించే వారు ముందుగా https://www.psbloansin59minutes.com/signup సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.

పేరు, ఈమెయిల్ ఐడీ, ఫన్ నెంబర్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. తర్వాత రుణం కోసం అప్లై చేసుకోవాలి. జీఎస్‌టీ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్, పర్సనల్ వివరాలు వంటివి అవసరం అవుతాయి.

Tags :
|
|
|
|

Advertisement