Advertisement

  • మంగళవారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మంగళవారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

By: chandrasekar Wed, 02 Dec 2020 09:49 AM

మంగళవారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు


స్టాక్ మార్కెట్ మంచి లాభాల్లో ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఏ దశలోను కిందకు రాలేదు. ప్రధానంగా ఐటీ, ఫార్మా, మెటల్ స్టాక్ మంచి లాభాల బాటలో పయనించింది. అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ సూచీ 3 శాతం మేర లాభపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను తాకాయి. బ్యాంక్ నిఫ్టీ 29,817 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 505.72 పాయింట్లు అంటే 1.15శాతం లాభపడి 44,655.44 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు అంటే 1.08 శాతం ఎగిసి 13,109 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

మంగళవారం 1869 షేర్లు లాభాల్లో, 974 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 169 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నిఫ్టీ 50 స్టాక్స్ 1.08 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.59 శాతం లభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.07 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.71 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.38 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 1.87 శాతం, నిఫ్టీ మీడియా 1.85 శాతం, నిఫ్టీ మెటల్ 1.65 శాతం, నిఫ్టీ ఫార్మా 1.74 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.88 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.75 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మాత్రమే స్వల్పంగా 0.04 శాతం నష్టపోయింది. ఇందువల్ల ట్రేడర్లకు లాభాలు చేకూరింది.

Tags :
|

Advertisement