ఇంటర్ నెట్ వినియోగదారులకు ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ కొత్త ఆఫర్స్
By: chandrasekar Sat, 23 May 2020 3:16 PM
కరోనా అరికట్టేందుకు
కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు తమ
ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటును కల్పించాయి. విద్యార్థులకు ఆన్
లైన్ తరగతుల నేపథ్యంలో ఇంటర్ నెట్ వాడకం బాగా పెరిగింది. టెలికాం సంస్థలు ఎయిర్
టెల్, జియో, వొడాఫోన్
కొత్త ఆఫర్స్ ప్రకటించాయి. 365 రోజుల ప్లాన్లతో ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్
ముందుకొచ్చాయి. ఎయిర్ టెల్ రూ. 2498 ప్లాన్ ను ప్రకటించింది. 365 రోజుల
కాలపరిమితితో ప్రతిరోజు 2జీబీ డేటా,
100 ఎస్ఎంఎస్ లు ,అపరిమిత ఫోన్ కాల్స్ అందించనున్నట్లు ఎయిర్ టెల్
తెలిపింది. రిలయన్స్ జియో రూ .2399 ప్లాన్ ను ప్రకటించింది. 365 రోజుల
కాల పరిమితితో రోజుకు 2 జీబీ డేటా,
100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత ఫోన్ కాల్స్ అందించనున్నట్లు జియో
ప్రకటించింది. వొడాఫోన్ రూ. 2399 ప్లాన్ తో 365 రోజుల కాల పరిమితి, ప్రతిరోజు 1.5జీబీ
డేటా,100
ఎస్ఎంఎస్ లు, అపరిమిత ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని వొడాఫోన్ స్పష్టం
చేసింది.