- హోమ్›
- జాతకం ఓర జోతిష్యం›
- శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తే ఎన్నో పుణ్యఫలాలు
శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తే ఎన్నో పుణ్యఫలాలు
By: chandrasekar Sat, 11 July 2020 6:54 PM
జ్యేష్ఠ మాసం
శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ రోజు వ్రతం మాచరించి
శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయి. ఈ రోజు ఒక్క
చుక్క కూడా మంచి నీరు తాగకుండా ఉపవాసం
ఉంటారు. ఈ రోజు హిందువులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నేడు నిర్జల ఏకాదశి.
సనాతన ధర్మంలో 24 ఏకాదశుల గురించి ప్రస్తావన ఉంది. ఎప్పుడైతే అధికమాసం
లేదా మాలమసం వచ్చాయో అప్పటినుంచి ఈ 24కి మరో రెండు అదనంగా కలిసి మొత్త 26
ఏకాదిశులు ఏడాదిలో వస్తుంటాయి.
తిథుల ప్రకారం అన్ని
ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవే. కానీ అన్నింటికంటే ప్రత్యేకమైంది మాత్రం నిర్జల
ఏకాదశి (2020 జూన్ 02). ఈ రోజు
ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే 24 ఏకాదశుల్లో ఉన్నటువంటి పుణ్య ఫలం ఈ ఒక్కరోజే
సంప్రాప్తిస్తుంది. ఏటా జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఈ నిర్జల
ఏకాదశి జరుపుకుంటారు. ఈ పర్వదినాన నీటిని తాగడం పూర్తిగా మానివేస్తారు. అందుకే
దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు.
పురాణాల ప్రకారం ఈ రోజును
భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. మరి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? నిర్జల
ఏకాదశిని భీమసేన ఏకాదశి అని ఎందుకు అంటారు? ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు లాంటి విషయాలు ఇప్పుడు
తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి జూన్ 1 మధ్యాహ్నం 2.57కి ప్రారంభమై జూన్ 2 మధ్యాహ్నం 12.04
గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా శ్రీ మహావిష్ణువుకు ఈ రోజు మధ్యాహ్నం 12.04 గంటల
వరకు వ్రతం చేస్తారు. వేద పండితులు ప్రకారం గంగా దసరా నుంచి ఈ రోజు వరకు ఉపవాసం
ఉండాలని చెబుతారు. ఉల్లిపాయలు, అల్లంతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రిపూట
కేవలం నేల మీద మాత్రమే నిద్రించాలి. మరుసటి రోజు ఉదయాన్ని బ్రహ్మముహూర్తంలో లేచి
శ్రీ హరిని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అనంతరం తలంటి స్నానమాచరించి వ్రత సంకాల్పానికి
ప్రతీనబూనాలి. పసుపు వస్త్రాలు ధరించి సూర్యదేవుడికి ప్రణామం చేయాలి.
పూజావిధానం:
సూర్యభగవానుడికి జలం
సమర్పించిన అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు, పండ్లు, అక్షతలు, చందనంతో పూజ చేయాలి. "ఓం నమో భగవతే
వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెబుతూ
హారతి సమర్పించాలి. ఇదే రోజు నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలి. ఉపవాసానికి
సంబంధించి ఏమైన సందేహాలు ఉంటే పండితులను అడగాలి. ద్వాదశి రోజు ఉపవాసాన్ని
ముగించాలి. మొదటగా శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవాలి. స్వామి ప్రసాదాన్ని
మిఠాయితో తయారు చేసి ప్రతి ఒక్కరకు అందించాలి. బ్రాహ్మణులకు ప్రసాదాన్ని అందిస్తే
వారి శక్తి సామర్థ్యాల ప్రసాదం ద్వారా మీకు లభిస్తాయి. మొత్తం ఉపవాసం అయిన తర్వాతా
మాత్రమే మీరు నీటిని తాగాలి.
ధర్మ, అర్థ, కామ, మోక్షాలు
అనే నాలుగు పురుషార్థాలను జయించేందుకు గాను ఏకాదశి రోజు ఉపవాసాన్ని ఆచరించాలని
మహర్షి వేదవ్యాసుడు పాండవులకు చెప్పాడు. వెంటనే ప్రతి స్పందించిన భీముడు వినయంతో
వ్యాసుడికి నమస్కరిస్తూ "స్వామి మీరు ప్రతి పదిహేను రోజులకోసారి వచ్చే
ఏకాదశికి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. నేను ఒక్క రోజు కూడా తినకుండా ఉండనలేను.
ఆకలితో నా కడుపులో వ్రక్ అనే అనే అగ్ని పుడుతుంది. అతడిని శాంతించేందుకు నేను
తప్పనిసరిగా కొంతమందికి సరిపడా బోజనం చేయాల్సిందే. మరి ఏకాదశి రోజు తినకుండా వ్రతం
ఎలా ఆచరించగలను" అని భీముడు.. వ్యాసుడిని అడిగాడు.
భీముడి సమస్య గురించి నిదానంగా
ఆలోచించిన మహర్షి అతడి మనోబలం పెంచేలా బదులిచ్చాడు. "ఓ కుంతీనందనుడా హిందు
ధర్మం ఎంతో ప్రత్యేకమైంది. ఇందుకు నీవు చింతించ వద్దు. నీవు ప్రతి ఏకాదశికి ఉపవాసం
ఉండాల్సిన పనిలేదు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి ఒక్క రోజు
ఉపవాసం ఉండు. మిగిలిన 24 ఏకాదశిలో వచ్చే పుణ్యఫలాలు నీకు దక్కుతాయి" అని
వ్యాసుడు భీముడు సమస్యకు పరిష్కారం చెప్పాడు.
వేదవ్యాసుడి ఆజ్ఞానుసారం
భీముడు ఏటా వచ్చే నిర్జల ఏకాదశి రోజు ఎలాంటి అంతరాయాలకు తావులేకుండా క్రమం
తప్పుకుండా ఉపవాస దీక్షను ఆచరిస్తున్నాడు. అందుకే ఏడాది పాటు పుణ్యాన్నిచ్చే
నిర్జల ఏకాదశిని పాండవ ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు
బ్రాహ్మణులు, నీరు అవసరమైనవారికి స్వచ్ఛమైన మంచినీరును దానం చేస్తే
మంచి జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ఫలితంగా జీవితంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా
జీవనం సాగిస్తారని నమ్ముతారు.