- హోమ్›
- జాతకం ఓర జోతిష్యం›
- శ్రీ కృష్ణుని పుట్టుక వెనుక ఉన్న కథ
శ్రీ కృష్ణుని పుట్టుక వెనుక ఉన్న కథ
By: chandrasekar Fri, 07 Aug 2020 9:27 PM
హిందూమతం యొక్క భూభాగంలో
ప్రముఖంగా చర్చించబడినది కృష్ణుడు యొక్క కథ. అత్యంత ప్రసిద్ధ హిందూ మతం దేవతల మధ్య
ముఖ్యంగా ఆకర్షణ మరియు శక్తివంతమైన వ్యక్తిత్వం ఉంటుంది. కృష్ణుడు విష్ణువు యొక్క
8 వ అవతారంగా పరిగణించబడుతుంది.
పుట్టుక కధ ఇలా నడుస్తుంది....
మానవులు చేసే పాపాల భారం
భూదేవికి భరించడం సాధ్యం కాలేదు. మనుషులు చేసిన పాపాల వలన మొక్కలు, జంతువులు, నీరు, గాలి మరియు భూమి నాశనం అవుతున్నాయి. భూదేవి విష్ణువు
దగ్గరకు వెళ్లి తనను కాపాడమని కోరుతుంది. హిందూ మతం గ్రంధముల ప్రకారం, ఈ ప్రధాన సంఘటన భగవంతుడైన కృష్ణుడి జన్మకు
ప్రేరేపించింది. ఇది కృష్ణుడు జన్మించటానికి మొట్టమొదటి కారణం.
మథుర పాలకుడు అయిన కంసుడు
ఒక దుష్ట శక్తిగా మారాడు. కంసుడు చేసే పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయి. కంసుడి
యొక్క సోదరి దేవకి వివాహం వాసుదేవునితో జరిగుతుంది. వివాహం జరిగిన వెంటనే ఆ
ప్రదేశంలో ఆకాశవాణి 'దేవకి,వసుదేవునికి పుట్టిన 8 వ సంతానంతో కంసుడికి మరణం సంభవిస్తుందని' పలికుతుంది. ఆ మాటలు విన్న వెంటనే కంసుడు కత్తి తీసి
దేవకిని చంపటానికి వెళ్తాడు. అప్పుడు
వాసుదేవుడు మరియు అతని భార్య దేవకి కంసుడితో తమకు పుట్టిన పిల్లలను అప్పగిస్తామని
వాగ్దానం చేస్తారు. కంసుడు ఈ జంటను ఖైదు చేసి కాపలా పెట్టెను.
ఈ జంటకు పుట్టిన ప్రతి
బిడ్డను కంసుడు వధించేను. కంసుడు 7 వ
బిడ్డను వధించిన తర్వాత, ఈ జంట 8 వ బిడ్డను రక్షించమని విష్ణువును కోరుతారు. ఒక
రాత్రి స్వప్నంలో వసుదేవునికి విష్ణువు కనిపించి గోకులంలో ఉన్న విష్ణు భక్తుడైన
నందుని ఇంట ఉన్న చిన్నారిని తెమ్మని చెప్పెను. వసుదేవునికి పుట్టిన అబ్బాయిని
తీసుకువచ్చి గోకులంలో ఉంచి, అదే
రోజు జన్మించిన నంద కుమార్తెను తీసుకోని వెళ్ళమని ఆదేశించేను.
విష్ణువు యొక్క అవతారం 8 వ బిడ్డ జన్మించిన తర్వాత జరిగినది. వసుదేవుని యొక్క
సంకెళ్ళు మరియు జైలు తలుపులు వాటి అంతటా అవే తొలగించబడ్డాయి. కుండపోత వర్షాలు
మరియు తుఫాను వచ్చాయి. ఆ సమయంలో నందుని యొక్క కుమార్తెను తీసుకువస్తున్న
వసుదేవునికి నదులు దారి ఇచ్చాయి. వాసుదేవుడు నందా యొక్క కొత్తగా పుట్టిన పిల్లతో
జైలు వెళ్ళాడు. కంసుడికి జరిగిన సంఘటనల గురించి తెలియదు. కంసుడు నంద కుమార్తెను
చంపటానికి వెళ్ళినప్పుడు,ఆమె
అకస్మాత్తుగా ఒక దేవదూతగా మారి నిన్ను సంహరించేవాడు వేరే చోట పెరుగుతున్నాడని
పలికెను. అతనికి నిన్ను చంపే వయస్సు వచ్చే వరకు అతను ఎవరని తెలియదని చెప్పెను. ఇది
కృష్ణుడు యొక్క జననం వెనుక ఉన్న కథ. హిందూ మతం పురాణాలలో ఈ విధంగా ప్రచారంలో
ఉన్నది.