Advertisement

శ్రీ కృష్ణుని బాల్య పర్వం

By: chandrasekar Fri, 07 Aug 2020 9:33 PM

శ్రీ కృష్ణుని బాల్య పర్వం


శ్రీకృష్ణుని పుట్టుకతో మేన మామకు ప్రాణగండం ఉంటుంది. దీంతో తన సోదరి దేవకి సంతానంపై కంసుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆమెకు మగపిల్లాడు పుడితే తనకు ప్రాణహాని ఉంటుందనే భయంతో గడుపుతుంటాడు. దేవకి వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది. ఎనిమిదవ సంతానంగా ఒక రాత్రి వేళ కృష్ణుడు జన్మిస్తాడు. ఈ విషయం తెలిస్తే మేనమామ కంసుడు కృష్ణుడికి హాని తలపెడతాడనే భయంతో దేవకి.. బిడ్డను నంద, యశోదలకు ఇచ్చివేయాలని భర్త వాసుదేవుడికి చెబుతుంది. దీంతో ఒక బుట్టలో కృష్ణుడిని ఉంచి, దానిని తలపై ఉంచుకుని వాసుదేవుడు బయల్దేరుతాడు. నంద-యశోదలకు ఆ బిడ్డను అప్పగించి, ఆమె ఆడ శిశువు యోగమాయను తాను తీసుకుని తిరిగి వస్తాడు. దేవకికి మళ్లీ ఆడపిల్లే పుట్టిందని కంసుడిని, మిగతా జనాన్ని దేవకీ వాసుదేవులు నమ్మిస్తారు. ఆ విధంగా కృష్ణుడికి మేనమామ నుంచి గండాన్ని తప్పిస్తారు. కానీ, తరువాత కాలంలో కృష్ణుడు మధురా నగరాన్ని పాలించే కంసుడిని సంహరిస్తాడు.

childhood,sri krishna,yasodha,bhagavad gita,devaki ,శ్రీ కృష్ణుని, బాల్య, పర్వం, యశోద, తల్లి


ఇక, కృష్ణ- యశోదల గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. కృష్ణుని బాల్య క్రీడలు, అతనిని లాలించి పాలించిన యశోద నేర్పరితనం చదవడానికి ఎంతో బాగుంటాయి. వెన్నదొంగ అయిన కృష్ణుడిని రోటికి కట్టివేయడం, గోపికలను కృష్ణుడు ఆటపట్టించడం, తన నోటిలో విశ్వాన్ని యశోదకు చూపడం వంటివి అబ్బురపరుస్తాయి. ఈ విధంగా కృష్ణుడి బాల్యమంతా గోకులంలో యశోద వద్దనే గడుస్తుంది.

బాల్యంలో బాలకృష్ణుని అల్లరి చేష్టలు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి అతను మన్ను తింటున్నాడంటూ గోపాలురు, గోపికలు యశోదకు ఫిర్యాదు చేస్తారు. యశోద ఒకసారి కృష్ణుడిని కనిపెట్టుకుని ఉండి.. అతను మన్ను తినడాన్ని గమనిస్తుంది. వెంటనే కోపంతో బాలకృష్ణుడిని తాడుతో రోకలికి కట్టివేస్తుంది. నిజానికి ఆ రోకలిలో ఒక రాక్షసి ఉంటుంది. దానిని పగలగొట్టడం ద్వారా కృష్ణుడు తన దైవత్వాన్ని ప్రదర్శిస్తాడు. తన బిడ్డ ధైర్యానికి యశోదమ్మ మురిసిపోతుంది. సాక్షాత్తూ విష్ణువునే బిడ్డగా లాలించే భాగ్యం దక్కిన గొప్ప తల్లి యశోదమ్మ.

childhood,sri krishna,yasodha,bhagavad gita,devaki ,శ్రీ కృష్ణుని, బాల్య, పర్వం, యశోద, తల్లి


ఒకసారి కృష్ణుడు మట్టి తిని తినలేదని అబద్ధం చెబుతాడు. నోరు తెరవాలని యశోద బలవంతం చేస్తుంది. దీంతో నోరు తెరిచిన కృష్ణుడు తన నోటిలో సప్త సముద్రాలను చూపిస్తాడు. మొత్తం విశాల విశ్వాన్ని కూడా ప్రదర్శి స్తాడు. దీంతో యశోద విస్తుపోతుంది. పాల సముద్రంపై తేలియాడే ఆదిశేషుని పానుపుపై లక్ష్మీ సహితంగా ఉన్న విష్ణువును కూడా యశోద ఆ నోటిలో దర్శిస్తుంది. వెన్నదొంగ కృష్ణుడి గురించి, ఆ చిన్నారిని అదిరించి బెదిరించి, బుజ్జగించి ముద్దు చేసే యశోద గురించి భాగవతంలో కృష్ణుని బాల్య క్రీడల్లో ఎంత చదివినా తనివి తీరదు.

childhood,sri krishna,yasodha,bhagavad gita,devaki ,శ్రీ కృష్ణుని, బాల్య, పర్వం, యశోద, తల్లి


తల్లి ప్రేమకు, వాత్సల్యానికి యశోద పెట్టింది పేరు. ఇక, కృష్ణుడి సోదరుడైన బలరాముడి తోనూ యశోదకు ఎంతో అనుబంధముంది. బలరాముడు రోహిణి కుమారుడు. ఈయన సోదరి సుభద్ర. యశోద జన్మనిచ్చిన యోగమాయ అంటే సాక్షాత్తూ కాళి అవతారమే. కృష్ణుడి పుట్టుక గురించి కనిపెట్టుకుని ఉన్న కంసుడు అతని బదులు యోగమాయ పుట్టిందని తెలిసి ఆమెను కూడా సంహరించడానికి సిద్ధమవుతాడు. దీంతో ఆమె కంసునికి అందకుండా వింధ్య పర్వతానికి ఎగసిపోతుంది. దీంతో ఆమె వింధ్యవాసిని దేవిగా ప్రతీతి అయ్యింది.

Tags :

Advertisement