Advertisement

ఇవి చేస్తే మన దగ్గర ధనం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది

By: Sankar Sun, 14 June 2020 1:45 PM

ఇవి చేస్తే మన దగ్గర ధనం ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది


వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని విషయాల వాళ్ళ మనం ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉంది ..అవి ఏంటో చూదాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో ఉన్న గోడకున్న అలమారలో డబ్బులు ఎప్పుడూ దాచకూడదు. ఎందుకంటే ప్రతికూల ప్రభావం వల్ల దక్షిణ దిశవైపు తెరిచి ఉంటుంది. ఫలితంగా డబ్బు నష్టపోయే అవకాశముంది. కాబట్టి ధనాన్ని ఎల్లప్పుడూ పడమర దిశలోని గోడకున్న అలమారలో దాచిఉంచడం మంచిది. తూర్పుకు అభిముఖంగా ఉండటం వల్ల లక్ష్మీ దేవి కృప మీపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి వ్యక్తిజీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. ఇంట్లో లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుంది.

వాస్తుశాస్త్రం ప్రకారం, శ్రీ లక్ష్మీ గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే, వారు డబ్బును ఎప్పుడూ కోల్పోరు. కానీ కొంతమంది దీనిని తప్పుడు దిశలో ఉంచుతారు. ఫలితంగా వాస్తుదోషం పెరుగుతుంది. డబ్బు కోల్పోవడం మరియు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచినప్పుడు గణపతి ముఖం లోపల ఉండే విధంగా ఉంచండి. ఇది సంపద, అదృష్టాన్ని తీసుకొస్తుంది.

వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంటి పైకప్పు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. సాధారణంగా ప్రజలు అనవసరమైన వస్తువులను పైకప్పుపై ఉంచడం జరుగుతుంటుంది. ఫలితంగా ఇంటి యజమాని ఒత్తిడిని ఎదుర్కోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల్లోనూ చిక్కుకుంటాడు. అందువల్ల ఇంట్లో మిగిలిన వ్యర్థాలను లేదా చెత్తను ఇంటి పైకప్పుపై వేయకూడదు. లేకపోతే ఇది కొన్నిసార్లు ఇక్కడ చెత్తఎక్కువ పేర్కొనిపోయి నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ చెత్త వేయకుండా అరికట్టాలి.

ఇంట్లో నీటికి సంబంధిత విషయాలన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి మీరు నీటికి చెందిన పాత్రలను ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే ఉంచడం ఉత్తమం. ఎందుకంటే ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు. కుబేరుడు సంపదను సూచిస్తాడు. అంతేకాకుండా నీటి కంటైనర్లు లీక్ అవ్వకుండా చూసుకోవడం ముఖ్యం. లేకపోతే వ్యక్తికి భారీ ఆర్థిక నష్టం కలుగుతుంది. అదేవిధంగా నీటి పాత్రను దక్షిణ లేదా పడమర దిశలో ఎప్పుడూ ఉంచకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫలితంగా మానసిక ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుంది.


Tags :
|

Advertisement